అమరావతి: పవన్ కల్యాణ్పై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. దత్తపుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయటపెట్టుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్బాలు పలికారని... వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారని పేర్కొన్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడన్నారు. యూ టర్నుల్లో యజమానిని మించిపోయాడంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.