ఫిబ్రవరి 14 నుంచి మూడు రోజుల పాటు నెల్లూరులో మహిళా పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వసంతలక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వసంతలక్ష్మీ తెలిపారు. పారిశ్రామిరంగంలో ఎదుగుతున్న, కొత్తగా అడుగు పెట్టే మహిళలకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ఈ సదస్సులో పాల్గొనే వారు తమ పేర్లను ఫిబ్రవరి 5వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.