ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో కాల్పుల కలకలం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2020, 02:34 PM

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసకుంది. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక పోలీసు అధికారి ఒకరు మృతిచెందగా.. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భారత భద్రతా బలగాలు ఖ్రీవ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రత దళాలకు మధ్య కాల్పులు ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. ఈ కాల్పుల్లో షాబాజ్ అహ్మద్ మరణించగా.. ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు ఒక అధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com