జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసకుంది. ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ప్రత్యేక పోలీసు అధికారి ఒకరు మృతిచెందగా.. మరో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. భారత భద్రతా బలగాలు ఖ్రీవ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రత దళాలకు మధ్య కాల్పులు ఎన్కౌంటర్కు దారితీశాయి. ఈ కాల్పుల్లో షాబాజ్ అహ్మద్ మరణించగా.. ఆర్మీ జవాన్కు గాయాలయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు ఒక అధికారి తెలిపారు.