ఏపిలోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో శ్రీను అనే ప్రేమోన్మాది దారుణానికి ఓడిగట్టాడు. తన ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారన్న కోపంతో అర్ధరాత్రి ప్రియురాలి ఇంటిపై దుండగుడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. అందరూ గాడ నిద్రలో ఉండగా జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి పూట ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆ కుటుంబసభ్యులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. తాను ప్రేమించిన వ్యక్తిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని గత కొంతకాలంగా శ్రీను ఆ కుటుంబంపై పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు పాల్పడ్డ నిందితుడు ఆ కుటుంబానికి దగ్గరి బంధువునే తెలుస్తోంది.
గత కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని వేధించేవాడని సమాచారం. అయితే ఆ యువతి తనతో పెళ్లికి నిరాకరించడమే ప్రేమోన్మాది ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని రాజమండ్రి ప్రభుత్వ అస్పత్రిలో స్థానికులు చేర్పించారు. చనిపోయిన చిన్నారుల్లో ఒక పాపతో పాటు ఒక బాబు ఉన్నారు. ఆ అమ్మాయి వివాహం అయిన నాటి నుంచి ప్రేమోన్మాది ఆ కుటుంబాన్ని వేదిస్తున్నారని చుట్టుపక్కలా నివాసం ఉండే స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.