ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారు : కన్నబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 04:04 PM

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. వికేంద్రీకరణే ఈ రాష్ట్రానికి శరణ్యమని, రాష్ట్ర ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని, ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని వివరించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల కంటే ముందే శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ జరగాలని సూచించిందని మంత్రి వెల్లడించారు.


ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్ర ప్రజలు ఇవాళ రాజధాని లేకుండా మిగిలిపోయారని ఆరోపించారు. ప్రాంతాల మధ్య అడ్డుగోడలు కట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు మధ్య అపోహలు పెంచే విధంగా వ్యవహరించవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com