ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పతారాస్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చదువుకోవాల్సిన వయసులో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక హాస్టల్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. పతారాస్ గ్రామానికి చెందిన బాలిక దంతేవాడలోని ఒక స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక తన గ్రామానికి చెందిన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ బాలిక తాను చదువుకుంటున్న స్కూల్ కు సంబంధించిన హాస్టల్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో పాటు ఆస్పత్రి సిబ్బందిని.. హాస్టల్ వార్డెన్ ను.. తోటి విద్యార్థినులను విచారించి వివరాలు కరించారు. తాను రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్నానని ఆ బాలిక తెలిపింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యహరించిన సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక జన్మనిచ్చిన మృత శిశువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ చెప్పారు.