ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా

national |  Suryaa Desk  | Published : Thu, Jan 16, 2020, 06:49 PM

నిర్భయ నిందితులకు విధించిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఈ నెల 22న ఉరిశిక్షను అమలు చేసే అవకాశం లేదని పటియాల కోర్టు స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఉరిశిక్ష కొత్త తేదీపై స్పష్టత రానున్నట్లు కోర్టు పేర్కోంది. కొత్త తేదీపై రేపటిలోగా వివరణ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు పటియాల కోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్షపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఉరిశిక్ష అమలుకు 14 రోజుల గడువు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు తీహార్ జైలులో ఇప్పటికే ఏర్పాట్లు కూడ పూర్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com