ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై కక్ష సాధింపు మంచిది కాదు :లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2020, 04:58 PM

టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడితే మహిళల పాస్ పోర్ట్ రద్దు చేయిస్తారా..? మరీ అంత దిగజారిపోయారా జగన్ గారు..? 500 మంది మహిళల మీద కేసులా..? 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా..? అని విమర్శలు గుప్పించారు. మహిళలపై కక్ష సాధింపు మంచిది కాదు జగన్ గారు అని లోకేశ్ ట్వీట్ చేశారు. తప్పు చేసి మీరు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న మీరు స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతున్నారు. మహిళలకు కనీసం నిరసన తెలిపే హక్కు ఉండదా అని లోకేశ్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com