ప్రధాని నరేంద్రమోడీకి ఎన్డీయేలో భాగస్వామ్యపక్షమైన జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ షాకిచ్చారు. బిహార్లో ఎన్ఆర్సీని అమలు చేయబోమని నితీష్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా కేంద్రం తీసుకోచ్చిన సీఏఏపై అనుమానాలున్నాయని.. పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని బిహార్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఆసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో బిహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీయూ అచితూచి అడుగులు వేస్తోంది.
జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బిహార్లో ప్రజలు వ్యతిరేకించే జాతీయ చట్టాలను జేడీయూ బహిరంగగానే వ్యతిరేకిస్తోంది. జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలకే నితీష్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మోడీ సర్కార్ తీసుకోచ్చిన సీఏఏతో పాటు ఎన్ఆర్సీని ఎన్డీయేలో వ్యతిరేకించిన తొలి పార్టీ జేడీయూయే కావడం విశేషం.