ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి నోరు జారారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రాష్ట్రంలోని 13 రాష్ట్రాలను అభివృద్ది చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. 13 జిల్లాలకు బదులు 13 రాష్ట్రాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి అన్నారు. గతంలో కూడా పుష్పశ్రీ వాణి నోరు జారారు. సీఎం జగన్ ఆదేశాలతో ఈ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పుష్పశ్రీ వాణి తిరుమలలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవలే టిక్ టాక్ చేసి పుష్పశ్రీవాణి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.