తిరుపతి : అయ్యప్పస్వామి భక్తులపై జవాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శబరిమల నుంచి హైదరాబాద్ వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలు చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న జవాన్ల దురుసుగా ప్రవర్తిస్తూ అయ్యప్ప భక్తులపై దాడికి దిగారు. దాడి ఘటనపై బాధిత భక్తులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు జవాన్లను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శ్రీకాకుళంకు చెందిన జవాన్లుగా సమాచారం.