న్యూఢిల్లి : తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం..రాయలసీమ, తమిళనాడులో చిరుజల్లులు పడే అవకాశం : భారత వాతావరణశాఖ ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఢిల్లిలో చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా తమిళనాడు మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కదులుతోందని, దీని ప్రభావంతో రాయలసీమ, తమిళనాడులో చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆవర్తనాల ప్రభావం వల్ల నేడు, రేపు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు వీ స్తాయని, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.