దిల్లీ: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ ఉత్సవం కేన్స్లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎర్రతివాచీపై హొయలొలికింది. లొరియల్ ప్యాలెస్ బ్రాండ్ అంబాసిడర్గా ఐష్.. శుక్రవారం కేన్స్ రెడ్కార్పెట్పై సందడి చేసింది. కేన్స్లో ఐష్ అందాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. మైఖెల్ సిన్కో డిజైన్ చేసి పౌడర్ బ్లూ వన్నె గౌనులో ఈ మాజీ ప్రపంచ సుందరి హొయలు పోయి.. అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఐశ్వర్య లుక్పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె అందం ముందు డిస్నీ రాకుమారి కూడా చిన్నబోయింది అంటూ ఐష్ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతకు ముందు కేన్స్ ఫొటోషూట్లో ఆకుపచ్చని డ్రెస్లోనూ ఐష్ కనువిందు చేసింది.
కేన్స్ 70వ సినీ ఉత్సవం మే 17న ప్రారంభమైంది. తొలిరోజు బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, మల్లికాషరావత్ ఎర్రతివాచీపై సందడిచేశారు. రెండో రోజు దక్షిణాది భామ శ్రుతిహాసన్ రెడ్కార్పెట్పై హొయలొలికించింది. ఇక మూడో రోజు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన అందంతో ఆకట్టుకుంది. ఐష్ కేన్స్లో పాల్గొనడం ఇది 16వ సారి. బాలీవుడ్ మరో నటి సోనమ్కపూర్ కూడా కేన్స్ ఎర్రతివాచీపై సందడి చేయనుంది.