పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు దక్షిణ 24 పరగణాల జిల్లాలో తుపాన్కు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. నేడు జరగాల్సిన పరిపాలనా యంత్రాంగపు సమావేశాన్ని ఆమె రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా ఉత్తర బెంగాల్ ప్రాంతంలో పర్యటనను కూడా ఆమె రద్దు చేసుకున్నారు. తుపాన్ బుల్బుల్ కారణంగా 10 మంది మృతి చెందగా, 2.73 లక్షల కుటుంబాలు తుపాన్ ప్రభావానికి గురయ్యాయి.