ఏండ్లుగా వివాదంలో ఉన్న సమస్యపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మార్గదర్శకాలు జారీచేసింది. చానళ్లలో చేపట్టే చర్చా కార్యక్రమాలు, డిబేట్లు, రిపోర్టింగ్ సందర్భంగా ప్రోగ్రామ్ కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. చానళ్లతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా ప్రోగ్రామ్ కోడ్ ను పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.