తమకల్కి ఆశ్రమంలో ఐటీ అధికారుల దాడులు జరగటంతో దేశం విడిచి పారిపోయామంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. మంగళవారం వారు మీడియాకు ఓ ప్రకట విడుదల చేస్తూ, తమ ఆరోగ్యం బాగుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ ఆశ్రమాల ప్రధాన కార్యాలయాల్లో ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ దంపతులు వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా ఐటి దాడుల్లో వందల కోట్లు ఆస్తులు బయటపడడంతో కొద్ది రోజులుగా కల్కి భగవాన్ బార్యతో కలసి అజ్ఞాతంలో గడుపుతున్నది వాస్తవం కాదని ఇద్దరు తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం నుంచి మరో ప్రకటన విడుదలైంది.