ఏపీ సర్కార్ గ్రామ వాలంటీర్లకు ఝలక్ ఇచ్చింది. స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది పలకుతున్నామంటూ.. సుమారు 2,66,796 మంది వలంటీర్ల నియామకం చేసేందుకు నిర్ణయం తీసుకొని. అందులో కొంతవరకు భర్తీ చేసింది. కాని ఇప్పుడే అసలు చిక్కు వచ్చింది. వాలంటీర్ల మీద ఆంక్షలను మొదలు పెట్టింది. గ్రామ వాలెంటీర్లు ఒక్కరోజు విధులకు దూరమైతే రోజుకు రూ.166 జీతంలో కట్ చేసేవిధంగా పలు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.