గువాహటి : అస్సాం ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వోద్యోగాలు ఆశించే వారికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వారు ప్రభుత్వోద్యోగాలు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయం 2021నుంచి అమల్లోకి వస్తుంది. అస్సాం మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన భూమి విధానంపై ఒక నిర్ణయం తీసుకున్నారు. భూమి లేని నిరుపేదలకు మూడు బిఘాల భూమి ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి అర బిఘా భూమి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటిని 15 సంవత్సరాలపాటు విక్రయించడానికి వీలు లేదని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.