ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ ప‌ట్టా 8 మంది డూప్‌ల‌ను దించిన‌ లేడీ ఎంపీ

international |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 12:14 PM

డిగ్రీ పట్టా కోసం ఓ మహిళా ఎంపీ చేసిన పని, ఇప్పుడామెను చిక్కుల్లో పడేసింది. త‌న‌లాగా డూప్ ల‌ను త‌యారు చేసి ప‌రీక్ష‌ల‌కు పంప‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ వ్య‌వ‌హారాన్ని మీడియా బైట పెట్ట‌డంతో యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యం ఆమెను బహిష్కించింది. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కి చెందిన ఎంపీ త‌మ‌న్నా నుస్రీత్ ఈ అక్ర‌మానికి పాల్ప‌డింది. తమన్నా నుస్రత్‌ బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఆమె రాయాల్సిన మొత్తం 13 సబ్జెకుల పరీక్షల కోసం తన మాదిరిగానే ఉన్న 8 మందిని యూనివర్సిటీ పరీక్షలను తన తరఫున రాయించేందుకు 8 మంది డూప్ లను తయారు చేయించారు. వారితోనే పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా, సాక్ష్యాలతో సహా మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ఈ డూప్ మహిళలు పరీక్షలు రాస్తుంటే, ఎంపీ అనుచరులు కాపలాగా ఉండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com