ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ కేసులు తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటన: దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 09:05 PM

సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇచ్చిన వినతి పత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రియాల్టీ షో నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. గోదావరిలో బోటు మునిగి నెలన్నర రోజులు అయితే.. రాష్ట్రం మునిగి నాలుగు నెలలు అయ్యిందన్నారు. ఇప్పటివరకు బోటును వెలికితీయక పోవడం జగన్ అసమర్థతకు నిదర్శనమన్నారు. బోటు బాధితుల ఆర్తనాదాలు జగన్ కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతు భరోసాను ఎన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చారో చెప్పాలన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com