ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్లమెంటు నియోజక వర్గం కేంద్రంగా జిల్లాలను చేస్తామంటూ ఎన్నికలలో ప్రకటించిన జగన్ తాజాగా రాయలసీమని10జిల్లాలుగా మార్చి దాని ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతోంది. ఈ 10 జిల్లాలలకు తోడుగా నెల్లూరు,ప్రకాశం జిల్లాలను కలుపుకొని మొత్తం 12 జిల్లాలతో గ్రేటర్ రాయలసీమగా రూపొందించాలని సిఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంపీ,ఎమ్మెల్యే నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను విభజించాలని, ఏడాదిలోపు విభజన ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేసారని తెలియవచ్చింది. ఆమధ్య తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు సమయంలో తలెత్తిన సమస్యలపై అధ్యయనం చేసి ఇక్కడ అటువంటి సమస్యలు ఎదురుకాకుండా వాటిని సమర్థవంతంగా అధిగమించాలని అధికారులకు సూచించారట జగన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే కర్నూలు జిల్లా మూడు జిల్లాలుగా.. అనంతపురం జిల్లా రెండుగా.. చిత్తూరు మూడుగా.. కడప జిల్లా రెండు జిల్లాలుగా విడిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.