ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చేనెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 06:42 PM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల 18 నుంచి డిసెంబరు 13 వరకు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉభయ సభల సెక్రటేరియట్లకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదింపజేసే అవకాశం ఉంది. అలాగే, దేశీయ తయారీ సంస్థలతో పాటు కొత్త కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును తగ్గించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ (అత్యవసరాదేశం) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే, ఈ-సిగరెట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ధూమపాన పరికరాలపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర సర్కారు ఇటీవల ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసింది. ఇవి చట్టరూపం దాల్చేందుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com