మాతృభాష పరిరక్షణకు తెలుగు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నట్లు మహాసభల కార్యదర్శి జి.వి.పూర్ణచందు తెలిపారు. డిసెంబరు 27, 28, 29 తేదీల్లో విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వేదికగా ఈ సభలు జరుగనున్నాయని వెల్లడించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారి జీవనం, తెలుగు సంస్కృతి పరిరక్షణలో ఎదుర్కొంటున్న సమస్యలు, భాష పరిరక్షణ, అభివృద్ధి, తెలుగు భాషా సంస్కృతులు, చరిత్ర, సాంకేతిక ప్రగతి అంశాలపై ఈ సభల్లో ప్రధానంగా చర్చిస్తామన్నారు.