ఆంధ్రలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక లభ్యత పెను సమస్యగా మారడం.. భవన నిర్మాణ పనులన్నీ నిలిచిపోయి కార్మికులు రోడ్డునపడడంపై జనసేన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వారికి అండగా ఉంటామని, ఇందుకోసం భారీఎత్తున లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలైంది. ఉపాధి లేక కార్మికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. వాళ్ల బాధలను అందరికీ తెలియజేసి, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నవంబరు 3 లేదా 4న విశాఖపట్నం వేదికగా మా పార్టీ అధ్యర్యంలో ఈ భారీ నిరసన ప్రదర్శన, లాంగ్ మార్చ్ను చేపట్టనున్నాం అని వెల్లడించారు. ఈ ఉద్యమాన్ని తాను ముందుండి నడిపిస్తానని సృష్టం చేశారు. దీనికి భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని జన సైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.