తెలంగాణ నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. జూబ్లీహిల్స్లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం వస్తుంటారని, ఇక్కడి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.