శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్ష కార్యక్రమాలు నిర్వహించారు ర ఈ కార్యక్రమంలో సభా ప్రాంగణంలో జ్యోతి వెలిగించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల పై కక్ష సాధింపు చర్య తప్ప ఐదు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీయొక్క రోజు కూడా కరెంట్ కోతలు లేవని ఇప్పుడు జనాలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని అలాగే తమ ప్రభుత్వం ఇసుక ఫ్రీగా అందించే వాళ్ళని ఇప్పుడు కొత్త పాలసీ పేదవాడు ఇసుక కొనుక్కోలేని పరిస్థితి తెచ్చి లక్షలాది కూలీల బతుకు లు రోడ్డునా పడేశారని అలాగే ప్రతి పేదవాడు కడుపునిండా భోజనం చేయాలని ఉద్దేశంతో తమ ప్రభుత్వం 5 రూపాయలకే భోజనం ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ మూసివేశారని ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలకు పార్టీ రంగులు వేస్తున్నారని ఇటువంటి దుర్మార్గ పాలన నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరైనా ఎత్తి చూపిస్తే వారి పై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యకర్తలు ఎవరు వైయస్సార్ పార్టీ వాళ్లు బెదిరింపులకు భయపడవద్దని కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలకు నిత్యం అండగా ఉంటానని నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు తెలియజేశారు.