విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ ఢిల్లి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం జగన్ ఢిల్లి చేరుకోనున్నారు. ఢిల్లి పర్యటనలో భాగంగా సీఎం జగన్ కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై జగన్ కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్తో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. పోలవరం రివర్స్ టెండరింగ్, పనులు నిలుపుదల వంటి అంశాలపై, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.