ఏపి రాజధానిని అమరావతి ప్రాంతంనుంచి వేరొక చోటికి మార్చాలన్న ఏసిలోని వైసిపి సర్కారు నిర్ణయాన్ని ఓపిచ్చి తుగ్లక్ ఆలోచన అని వ్యాఖ్యానించారు టొబాకో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు ఆదివారం ఆయన గుంటూరు జిల్లా పొన్నూరులో బీజేపీ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొనడానికి వచ్చి కాసేపు మీడియాతో మాట్లాడారు, రాష్ట్రంలో సర్వేలు చేయించుకుని 80శాతం సంతృప్తిగా ఉన్నారంటూ ధీమాలో ఉన్న చంద్రబాబుకు జరిగిన పరాభవం ఎదురుకాకుండా ఉండాలంటే జగన్ తను అధికారంలోకి వచ్చిన తరువాత పాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుంటే మంచిదన్నారు. కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని చెపుతూ, వేల కోట్లు ఖర్చు జరిగాక రాజధాని ని మార్చేస్తామంటూ మంత్రులు తప్పుడు సంకేతాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసారు. కొన్ని విభాగాలను వివిధ జిల్లాలకు వికేంద్రీకరణ చేసుకోవటం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.