ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 08:21 PM

ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం కానున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ముగిసిన తర్వాత నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు సీఎం జగన్. ఢిల్లీకి చేరుకున్న అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం సీఎం కార్యాలయం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్‌తో పాటు ఇతర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని, రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 9, 10 షెడ్యూల్‌కు సంబంధించి సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, అపరిష్కృతంగా ఉన్న వాటిని పరిష్కరించాలని ఆయన మంత్రులను కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని మంత్రి షెకావత్‌ను కోరనున్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com