గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇప్పటికే ఈ ఘటనఫై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని, కేసును నీరుగారుస్తున్నారని బాలిక బంధువులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ నుండి ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.