జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అధికారం చేపట్టి దాదాపు అయిదు నెలలు కావొస్తుంది. ఉద్యోగాల నియామకం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని పై చర్యలు అన్నిటిని త్వరితంగా పూర్తీ చేస్తున్నారు. ఎప్పటికి వుండే ప్రతి పక్ష పార్టీ విమర్శలు కూడా వున్నాయి. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ 263 కోట్ల రూపాయలను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. వీటి పై నారా లోకేష్ స్పందిన్చారు. చాల దారుణమైన వ్యాఖ్యలు చేసారు నారా లోకేష్.
జగన్ అనే నేను ఎన్నికల ముందు కోతల రాయుడుగారు ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు, ఎన్నికల తరువాత హామీలకు ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండి అంటూ ఒక వీడియో ని సైతం సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. 1100 కోట్ల రూపాయల్ని ఇస్తామని చెప్పడం, కానీ ఇపుడు ప్రకటించిన దాని పై లెక్కలను తేల్చాడు నారా లోకేష్. అయితే టీడీపీ 336 కోట్ల ని ఇచ్చేందుకు సిద్ధం చేయగా వైసీపీ కోర్ట్ కేసుల మూలంగా ఆగిన విషయాన్నీ గుర్తు చేసారు. అందులో కూడా 264 కోట్ల రూపాయల్ని ప్రకటించడం తో మిగిలిన 72 కోట్ల లెక్కని పరోక్షంగా ప్రశ్నించారు. వీటన్నిటికీ కౌంటర్ ఇస్తూ ఇంత మాయ చేస్తారు కాబట్టే మీరు గౌరవనీయులైన ఏ-1 కాగలిగారు అని అన్నారు.