జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని లో ఆంధ్రజ్యోతి విలేఖరి కాతా సత్యనారయణ హత్యకేసులో పోలీసులు ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ చెప్పారు. మంగళవారం రాత్రి టి.వెంకటాపురం నుంచి ఎస్. అన్నవరం వస్తున్న సమయంలో దుండగులు కాతా సత్యనారాయణను హత మార్చారు. ఈ హత్య కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అనుమానిస్తూ సత్యనారాయణ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.