ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కూతురైన అరకు ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 04:38 PM

ఇప్పటివరకు కుమారిగా ఉన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శ్రీమతి కాబోతున్నారు. తన స్వగ్రామమైన శరభన్నపాలెంలో.. బుధవారం ఉదయం 9 :15 గంటలకు ఆమెను కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్దంగా పెళ్లికూతురిని చేశారు. తల్లి చెల్లాయమ్మతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు అంతా ఆమెను ఆశీర్వదించారు. మాధవికి గురువారం 3:15 గంటలకు గొలుగొండ మండలం కృష్ణదేవి పేట గ్రామానికి చెందిన.. సెయింట్ థెరెసా పాఠశాల కరస్పాండెంట్ కుసిరెడ్డి. శివప్రసాద్ తో వివాహం జరగనుంది. ఈమేరకు పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com