రాన్బాక్సీ కంపెనీ ప్రమోటర్లు మల్వీందర్సింగ్, ఆయన సోదరుడు శివీందర్ సింగ్లను ఢిల్లి కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. 2397 కోట్ల రూపాయిల కుంభకోణం కేసులో వారిని 14 రోజులపాటు జ్యుఢిషియల్ కస్టడీకి పంపుతూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిశాంత్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు సునీల్ గోధ్వాని, అనిల్ సక్సేనా, కవి అరోరాలను కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.