రైతు భరోసాతో లబ్ధి పొందని రైతులకు సమస్యలేవైనా ఉంటే గుంటూరు జిల్లాలో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు జేసీ గౌతమి పేర్కొన్నారు. 8886648449 అనే టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, లబ్ధిపొందని రైతులు ప్రజా సాధికార సర్వే నమోదులో మరణ, కేసులు, నేషనల్ ఖాతాలు, ఆధార్ సీడింగ్లో తప్పులు, బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం కాకపోవడం, వెబ్ల్యాండ్లో నమోదై ప్రజాసాధికార సర్వేలో ఉండి రేషన్కార్డులోనూ ఉండి అనర్హులుగా ప్రకటించిన వారు ఈ కాల్సెంటర్కు ఫోన్ చేసి తమ సమస్యను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఆయా మండలాల్లో ఉన్న వ్యవసాయశాఖాధికారులను నేరుగా కూడా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. రైతు భరోసాలో నమోదుకాని రైతులుంటే నవంబరు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని జేసీ స్పష్టం చేశారు.