టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ తగిలింది. దివాకర్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా లేని 9 దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా బస్సులను నడుపుతున్నట్లు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పాటు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.