కోల్ కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డోన్స్ వేదికగా జరగనున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని మోడీ,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు నేతలకు క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరు ప్రధానులు కలిసి భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ చూడనున్నారు. త్వరలో దీనికి సంబంధించి అధికారికి ప్రకటన వెలువడనుంది. నవంబర్-22నుంచి నవంబర్-6వరకు ఈ డెన్ గార్డెన్స్ లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది