ఆంధ్ర ప్రదేశ్ లో.. నూతన సంవత్సరంలో కొత్త బార్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులన్నిటినీ రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయానికొచ్చింది. నవంబరు మూడో వారంలో నోటిఫికేషన్ జారీచేయాలని, డిసెంబరు చివరికి లైసెన్సులు ఇచ్చి జనవరి 1 నుంచి కొత్త బార్లు అందుబాటులోకి తేవాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా అందులో 30 శాతం అంటే 252 తగ్గించి బార్ల సంఖ్యను 588కి కుదించాలని భావిస్తున్నారు. వాటి సమయాన్ని కూడా తగ్గించాలని ఆలోచన చేస్తున్నారు.