అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. ఇవాళ్టితో వాదనలు ముగియనున్న నేపథ్యంలో ఉదయం నుంచి కోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాదనలు నడుస్తుండగా హిందూ మహాసభ న్యాయవాది కోర్టులో చూపించిన పుస్తకంపై అభ్యంతరం తెలిపిన ముస్లిం తరపు న్యాయవాది పుస్తకాన్ని చించి వేయడంతో సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుంచి వెళ్లిపోతానని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సీరియస్ అయ్యారు. నిజానికి అయితే ఇప్పటివరకు అయోధ్య కేసుపై వాదనలు ముగిసినట్టేనని సీజే వెల్లడించారు.