హైదరాబాద్: పిడుగుపాటుకు తండ్రి కొడుకులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల శివారు వల్యతండాలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రికొడుకుల ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరపున ఇచ్చే సాయాన్ని వెంటనే అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.