మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయ్ పూలే, వీర్ సవార్కర్లకు భారతరత్న పురస్కారాలు సాధించడమే ధ్యేయమని రాష్ట్ర పార్టీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పీఎంసీ బ్యాంక్ విషయాన్ని ఎన్నికల అనంతరం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, తాను వ్యక్తిగతంగా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెడతానని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న శివసేన.. ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రాధాన్యం ఇవ్వకుండా స్వతంత్రంగా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే.