ఫోన్ల ద్వారా కొందరు ఉగ్రవాదుల సమీకరణకు పాల్పడుతున్నార’ని గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. సోమ వారం శ్రీనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కశ్మీర్ ప్రజలు ఇంతకుముందు ప్రభుత్వాల నిషేదాలతో ఫోన్లు లేకుండానే ఉన్నారని, ‘టెలిఫోన్లు మాకు ముఖ్యం కాదు. కశ్మీరీల జీవితాలే అన్నింటికన్నా ముఖ్యం అని కాశ్మీరీలు భావిస్తున్నారని అన్నారు.
జమ్ము-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ని ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన తర్వాత మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపి వేశారు. పరిస్థితులను బట్టి ఆగస్టు 17 నుంచి ల్యాండ్లైన్ సేవల్ని దశల వారీగా పునరుద్ధరించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 40 లక్షల పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ల సర్వీ సులు అందుబాటు లోకి వచ్చాయి. త్వరలో ఇంటర్నెట్ సేవల్ని సైతం పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.