దీపావళి పర్వదినం సందర్భంగా తమకు అయోధ్యలో పూజలు చేసుకోడానికి అనుమతినివ్వాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సుప్రీంను కోరింది. సుప్రీంను వీహెచ్పీ అలా కోరిందో లేదో వెంటనే బాబ్రీ మజ్జిద్ తరపున పిటిషనర్లు కూడా స్పందించారు. ఒకవేళ పూజులు చేసుకోడానికి వీహెచ్పీకి అనుమతినిస్తే నమాజ్ చేసుకోడానికి తమకూ అనుమతినివ్వాలని షరతు విధించారు. అయితే దివ్వెలు వెలిగించడానికి లేదా ఇతరత్రా పూజలకు వీహెచ్పీకి అనుమతినిచ్చేది లేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.