ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్లకు మహాబలిపురం ప్రజల తరపున జిల్లా అధికారులు ప్రత్యేక కానుక తయారు చేయించారు. ఇద్దరు నేతలు చేతులు కలిపిన రూపంలో శిల్పం చెక్కించారు. 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, 25 కిలోల బరువున్న రెండు శిల్పాలను స్థానిక శిల్పి బసూలుద్దీన్చే తయారు చేయించారు. కాంచీపురం జిల్లా అధికారులు ఇరువురు నేతల భద్రతాదికారులకు వీటిని అందజేశారు.