మూడు రోజుల పాటు జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సును కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టెలికాం కార్యదర్శి అంశు ప్రకాశ్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్, రిలయెన్స్ జియో బోర్డ్ సభ్యుడు మహేంద్ర నహతా తదితరులు పాల్గొన్నారు.