జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. గ్రెనేడ్ దాడి జరగడంతో పోలీసులు శ్రీనగర్లోని హరిసింగ్ హై స్ట్రీట్లో తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు చెప్పారు.