సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్లు మాయమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన లెక్కలను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఈ నిధుల గోల్ మాల్ విషయంలో కార్మిక శాఖ హస్తం ఉన్నట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 16మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తున్నారు.