రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో ముకేశ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 51.4 బిలియన్ డాలర్లు. జియో రాకతో ఆయన సంపద 4.1 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇక అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 15.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
గతేడాది భారత్ నుంచి రెండో జాబితాలో ఉన్న అజిజ్ ప్రేమ్ జీ ఈ సారి 17వ స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో అజీజ్ ప్రేమ్ జీ తన సంపదలో చాలా వరకు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. అంబానీ, అదానీ తర్వాత అశోక్ లే ల్యాండ్ హిందూజా బ్రదర్స్, పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్ కొటక్ టాప్ 5లో నిలిచారు. ఈసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆరుగురికి కొత్తవారికి చోటు దక్కింది.