కర్నూలు జిల్లా సంజామల మండల తహశీల్దార్ ఆర్.గోవింద్ సింగ్ ఏసీబీ వలలో చిక్కారు. జె.రామేశ్వరరెడ్డి తన పొలం పాసుబుక్కును ఆన్ లైన్ చేసేందుకు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేక పోవటంతో నేరుగా తహసిల్దార్ని కలసి తన గోడు విన్నవించుకున్నాడు. కర్నూల్ జిల్లా, సంజమాలా మండల పరిధిలో రెడ్డిపల్లి గ్రామంకు చెందిన తనకు సమీప గ్రామమైన అల్వకొండ గ్రామంలో ఉన్న సి-నెం. 1216-1 సర్వే నంబర్లో ఉన్నభూమి మ్యుటేషన్ ప్రాసెస్ చేయాలని కోరటంతో తహసిల్దార్ లంచం డిమాండ్ చేశాడు. అప్పుడు కొంత మొత్తం చెల్లించినా పనికాక పోవటంతో ఈ విషయమై గోవింద్ సింగ్ని ప్రశ్నించాడు. మరి 5వేలు చెల్లించితే గాని పని పూర్తి కాదని కరాఖండీగా చెప్పడంతో ఇచ్చినా ఏసీబీ ఆశ్రయించాడు రామేశ్వర్ రెడ్డి. దీంతో ఏసిబి అధికారుల సూచనలతో తహసిల్దార్ కార్యలయానికి వెళ్లిన రామేశ్వర్ రెడ్డి ఆతనికి మరోసారి రూ. 5,000 / – సమర్పించుకున్నాడు. ఆ క్షణంలో నే కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం సారధ్యంలోని ఏసిబి బృందం దాడి చేసి తహశీల్దార్ గోవింద్ సింగ్ ను పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ లో లంచం తీసుకున్నట్లు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని, అతని కుర్చీ క్రింద సదరు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని, అలాగే సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు.