జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురువారం హుఠాహుఠిన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ చేరుకొని అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లారు. అక్కడి మాత్రి సదన్ ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు అన్నపానీయాలు మాని నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసి,. 33ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచిన స్వామి నిగమానంద సమాధిని దర్శించి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలలో పవిత్ర గంగా నది తీవ్రంగా కలుషితం అవుతోందని. ప్రక్షాళన కోసం తాము చేస్తున్న పోరాటానికి దక్షిణాది నుంచి మద్దతు ఇవ్వడం లేదని స్వామి శివానంద మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు తమ పోరాటానికి అండగా నిలవాలని పవన్ కల్యాణ్ని కోరారు. ఈ భేటీలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గంగా నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమే” అన్నారు.
అనంతరం స్వామి శివానంద మహారాజ్ గంగానదికి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ , రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, ‘వాటర్ మ్యాన్’ రాజేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు.